రేపటి నుంచి పరుగులు తీసే రైళ్ల వివరాలు!

రేపటి నుంచి పరుగులు తీసే రైళ్ల వివరాలు!
x
Highlights

దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది.

దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించి పోయింది. గత 50 రోజులుగా నిలిచిన రవాణా వ్వవస్థను పునరుద్ధరించాలని రైల్వేశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో పలు రైల్లు పట్టాలెక్కబోతున్నాయి. సుమారుగా 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి.

అందుకోసం రైల్వే శాఖ, టికెట్ రిజర్వేషన్ ను నేటి సాయంత్రం నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. ఇక రైళ్లలో ప్రయాణించే ప్రజలను నేరుగా ప్రయాణానికి అనుమతించమని ముందుగా వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తామని, తరువాతనే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రయాణికులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని స్పష్టం చేసింది రైల్వే శాఖ.

ఇక రేపటి నుంచి తిరిగే రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలను పరిశీలిస్తే...

బెంగళూరు - న్యూఢిల్లీ, తిరువనంతపురం - న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ, బిలాస్ పూర్ - న్యూఢిల్లీ, హౌరా - న్యూఢిల్లీ, రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ, డిబ్రూగఢ్ - న్యూఢిల్లీ, న్యూఢిల్లీ - జమ్మూతావి, రాంచీ - న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ - న్యూఢిల్లీ, అగర్తలా - న్యూఢిల్లీ, భువనేశ్వర్ - న్యూఢిల్లీ, మడ్ గావ్ - న్యూఢిల్లీ, సికింద్రాబాద్ - న్యూఢిల్లీల మధ్య రైళ్లు తిరుగనున్నాయి.

సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైలు బుధవారం బయలుదేరుతుంది. అలాగే ఆదివారం రోజున తిరుగు ప్రయాణంలో బయలుదేరనుంది.ఈ ట్రైన్ కాజీపేట మీదుగా ప్రయాణాన్ని సాగిస్తుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.

న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.

బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories