గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలివే : నిర్మలా సీతారమన్

గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలివే : నిర్మలా సీతారమన్
x
నిర్మలా సీతారమన్
Highlights

గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

గత ఆరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో సంధించిన ప్రశ్నపై ఆర్థిక మంత్రి స్పందించారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రం ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని నిర్మల సీతారామన్ తెలిపారు.

తెలంగాణకు ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1,916కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories