Coronavirus Live Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..నిన్న ఒక్కరోజే 230మందికిపైగా నిర్ధారణ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకి తన పంజా విసురుతుంది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 200కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, దాదాపు 11 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు కేంద్రం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,251కి చేరింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 35కు చేరుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా తొమ్మిది మంది చనిపోగా, గుజరాత్ లో ఏడుగురు మంది చనిపోయారు. ఇక తెలంగాణలో కొత్తగా ఆరుగురిలో కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. ఆరుగురు మృతి చెందారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 23కు చేరింది.. సోమవారం రోజునాటికి కేరళలో అత్యధికంగా 32 కేసులు నమోదు అయ్యాయి..

పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది..

మహారాష్ట్ర 238, కేరళ 234, ఢిల్లీ 97, ఉత్తరప్రదేశ్‌ 96, కర్ణాటక 91,లడఖ్ 13, తెలంగాణ 77, రాజస్థాన్ 79, జమ్మూ కశ్మీర్‌ 49, గుజరాత్ 70, ఆంధ్రప్రదేశ్ 23, తమిళనాడు 67, మధ్యప్రదేశ్ 47, పంజాబ్ 41, హర్యానా 36, పశ్చిమ్ బెంగాల్ 22, బీహార్ 15, అండమాన్ నికోబార్ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,100 కేసుల్లో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఏడు లక్షలకి చేరుకున్నాయి. 35 వేల మందికి పైగా చనిపోయారు.

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూపే భారతదేశ పటం! ప్రస్తుతం కరోనా కేసుల వివరాలు రాష్ట్రాల వారీగా..
Show Full Article

Live Updates

Print Article
More On
Next Story
More Stories