కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. 70 స్థానాల్లో 63 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. 70 స్థానాల్లో 63 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం ట్విట్‌ చేశారు. అయితే చిదంబరం చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ మహిళా నాయకురాలు తప్పుబట్టారు.

చిదంబరం వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిష్టా ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఔట్ సోర్సింగ్ చేసిందా? అని ప్రశ్నించారు. కాని పక్షంలో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషించుకోవాల్సిన మీరు..ఆప్ విజయంపై ఎందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నారని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ దుకాణం బంద్ చేసుకోవడం మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories