మోదీని మురికి కాలువతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ

మోదీని మురికి కాలువతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ
x
Highlights

కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఇందిరా గాంధీని మోడీతో పోల్చడం సరికాదని...

కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఇందిరా గాంధీని మోడీతో పోల్చడం సరికాదని అన్నారు. ఇందిరాగాంధీ గంగానదిలాంటి వారైతే మోడీ మురికి కాలువ లాంటివారని అధిర్‌ రంజన్‌ అన్నారు. అధిర్ తీరుపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిని అవమానిస్తారా? అని విరుచుకుపడ్డారు. అధిర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన వెనక్కి తగ్గారు. తన ప్రసంగంలో ఎక్కడా 'నాలి' (కాల్వ) అనే పదాన్ని వాడలేదని అధిర్ వివరణ ఇచ్చారు. తనకు హిందీ మాట్లాడడం అంత బాగా రాదని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories