దెయ్యాన్ని చూపించి... యాబై వేలు పట్టండి..!

దెయ్యాన్ని చూపించి...  యాబై వేలు పట్టండి..!
x
Highlights

దెయ్యం ఉందని సాక్షాధారాలతో నిరోపిస్తే యాబై వేలు బహుమతిగా ఇస్తానని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చారు. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది....

దెయ్యం ఉందని సాక్షాధారాలతో నిరోపిస్తే యాబై వేలు బహుమతిగా ఇస్తానని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చారు. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మూడ నమ్మకాలు, చేతబడులపైన ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే అనే కలెక్టర్ దెయ్యం ఉందని నిరోపిస్తే నా జేబులో నుండి తీసి యాబై వేల రూపాయలను బహుమతిగా ఇస్తానని ప్రకటన చేసాడు. చేతబడులు, మనిషికి దెయ్యం పట్టిందని చెప్పి మనుషుల ప్రాణాలు తీస్తున్నారని వాటి మాయలో నుండి ప్రజలకి విముక్తి కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సదరు కలెక్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories