Jobs: కోల్ ఇండియాలో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Jobs: కోల్ ఇండియాలో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
x
Highlights

భారత దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది.

భారత దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. బొగ్గు గనుల మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ మొత్తం 11 విభాగాల్లోని 1326 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబరు 21 నుంచి 2020 జనవరి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ద్వారా తెలియజేసారు.

పోస్టుల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రైనీ: 1326 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు

♦ మైనింగ్ : 228, మెకానికల్ : 258, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ : 254, ఎలక్ట్రికల్: 218, పర్సనల్ & హెచ్ఆర్ : 89, సివిల్: 68, సిస్టమ్స్ : 46, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ : 28, కోల్ ప్రిపరేషన్ : 28, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ : 26, మార్కెటింగ్ & సేల్స్ : 23

క్యాటగిరిల వారీగా

♦ జనరల్-485, ఎస్సీ-206, ఓబీసీ (NCL)-361, ఎస్టీ-142, ఈడబ్ల్యూఎస్-132

విద్యార్హత

♦ బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ (హెచ్ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్)/ఎంబీఏ/ మాస్టర్ డిగ్రీ(సోషల్ వర్క్), పీజీ డిగ్రీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి

♦ 01.04.2020 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

♦ జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రుసుము రూ.1000

♦ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు ఫీజు మినహాయింపు

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా​

ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష్, మెడికల్ టెస్ట్ ద్వారా

ఆన్‌లైన్ పరీక్ష విధానం..

♦ పరీక్షలో రెండు ప్రశ్నాపత్రాలు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.

♦ ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. మొత్తం 200 ప్రశ్నలకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-1లో

♦ జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్

పేపర్-2లో

♦ ప్రొఫెషనల్ నాలెడ్జ్ , మల్టీపుల్ ఛాయిస్ విధానం

అర్హత మార్కులు..

♦ రాతపరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40, ఓబీసీ అభ్యర్థులకు 35, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30గా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ

♦ రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వూ ఉంటుంది.

♦ ఇంటర్వ్యూకు 10 మార్కులు

♦ అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

21.12.2019 : ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం

19.01.2020 : ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది

ఆన్‌లైన్ పరీక్ష తేది : 27.02.2020 & 28.02.2020

జీతభత్యాలు

శిక్షణ కాలంలో నెలకు రూ.50,000

శిక్షణ అనంతరం నెలకు రూ.60,000


అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

వెబ్ సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories