సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు
x
Highlights

అయోధ్య కేసుల తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన...

అయోధ్య కేసుల తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన కార్యాలయాన్ని తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. సీజేఐ, ఆయన కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు 2010లో వెలువరించిన తీర్పును సమర్థించింది. సమాచార హక్కు, గోప్యత హక్కు నాణేనికి రెండు ముఖాల వంటివని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories