తీహార్ జైల్లో చిదంబరంకు అస్వస్థత..

తీహార్ జైల్లో చిదంబరంకు అస్వస్థత..
x
Highlights

తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడటంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య...

తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడటంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మెడికల్ రిపోర్ట్స్‌ను బట్టి ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేసేది లేనిది డాక్టర్లు నిర్ణయించనున్నారు. సాధారణంగా తీహార్ జైలు ఖైదీలను దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లడం పరిపాటి. కానీ చిదంబరం విషయంలో కోర్టు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తప్పనిసరిగా ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories