ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్..1984 పునరావృతం కానివ్వమన్న ఢిల్లీ హైకోర్టు

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్..1984 పునరావృతం కానివ్వమన్న ఢిల్లీ హైకోర్టు
x
ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
Highlights

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కానివ్వమని కోర్టు తేల్చి చెప్పింది....

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కానివ్వమని కోర్టు తేల్చి చెప్పింది. పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సందర్శించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్క బాధితుడి వద్దకు చేరుకోవాల్సిన సమయం ఇది అని కోర్టు తెలిపింది. ప్రతి ఒక్కరికి జడ్‌ సెక్యూరిటీలా రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితులు, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఐబీ ఆఫీసర్‌ మృతి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐబీ ఆఫీసర్‌ చనిపోవడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.

అల్లర్లకు భయపడి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి భయపడితే వారికి షెల్టర్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. షెల్టర్లలో బాధితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. మృతుల కుటుంబాలతో మాట్లాడి అంత్యక్రియలు సజావుగా సాగేలా చూడాలని కోర్టు చెప్పింది. హెల్ప్‌లైన్లు, హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేసి ప్రజలకు సహాయం చేయాలి. క్షతగాత్రుల వద్దకు అంబులెన్స్‌లు సురక్షితంగా చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories