ముగిసిన కేంద్ర కేబినెట్... కాసేపట్లో కాశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన

ముగిసిన కేంద్ర కేబినెట్... కాసేపట్లో కాశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన
x
Highlights

ప్రధాని నివాసంలో సమావేశం అయిన కేంద్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాశ్మీర్‌పై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీనికి...

ప్రధాని నివాసంలో సమావేశం అయిన కేంద్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాశ్మీర్‌పై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను పార్లమెంట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు.11 గంటలకు లోక్‌సభలో, 12 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. మరోవైపు పార్లమెంట్‌లో ప్రధాని వివరణ ఇవ్వాలని.. విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని సమాధానం చెప్పాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నోటీస్‌ ఇచ్చింది. మరోవైపు కశ్మీర్‌ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కాశ్మీర్ విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులంతా జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే మతఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో.. అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories