గుజరాత్‌లో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

గుజరాత్‌లో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి
x
Highlights

గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో అర్ధరాత్రి మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో అర్ధరాత్రి మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందాగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, NDRF సిబ్బంది స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని అధికారులు బెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories