బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఆఫర్లు

బీఎస్ఎన్ఎల్ నుంచి  సరికొత్త ఆఫర్లు
x
Highlights

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 99 ప్లాన్‌లో ఇప్పుడు...

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 99 ప్లాన్‌లో ఇప్పుడు రోజుకు 1.5 జీబీ డేటాను 20 ఎంబీపీఎస్ స్పీడ్‌ కు పెంచింది. అలాగే సరికొత్త కాంబో ప్యాక్ 'బీబీజీ కాంబో యూఎల్‌డీ 1495 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కు నూతన వినియోగదారుల తోపాటు పాత కస్టమర్లు కూడా ఈ ప్లాన్‌కు అర్హులే. రూ.1495 ప్లాన్‌లో 10 ఎంబీపీఎస్ వేగంతో రోజుకు 25 జీబీ డేటా అందనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది బీఎస్ఎన్ఎల్.

ఈ ప్లాన్‌లో యూజర్లకు రెండు ఉచిత ఈ-మెయిల్ ఐడీలు, 1జీబీ చొప్పున స్పేస్ లభిస్తాయి. వీటితోపాటు అపరిమిత వాయిస్ కాల్స్ కూడా ఉన్నాయి. అలాగే రూ.1745 తో రీఛార్జ్ చేసుకుంటే..16 ఎంబీపీఎస్ వేగంతో రోజుకు 30 జీబీ డేటా లభించనుంది. దీంతోపాటు మరో ప్లాన్ రూ.2295 ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 24 ఎంబీపీఎస్ వేగంతో 35 జీబీ డేటా లభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories