కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉన్నందున పార్టీ మరింత పటిష్టతపై దృష్టిసారించింది బీజేపీ. ఇందులో భాగంగా ఇటీవల...
ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉన్నందున పార్టీ మరింత పటిష్టతపై దృష్టిసారించింది బీజేపీ. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ముగ్గురు మాజీ సీఎంలకు బీజేపీ అధిష్టానం కీలక పదవులు కల్పించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎంలైన శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్లను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్టీ బులిటెన్ విడుదల చేశారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు..
నేతలు ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ ప్రభుత్వం దారుణమైన ఓటమిని చవిచూడగా.. మధ్యప్రదేశ్లో మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ గట్టి పోటీ ఇచ్చారు. ఇక రాజస్థాన్లో వసుంధరా రాజే కూడా గట్టిపోటీయే ఇచ్చినా అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. కాగా సిఎంలుగా అనుభవజ్ఞులైన చౌహాన్, రమణ్ సింగ్, వసుంధరా రాజేలను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT