తెరపైకి మరో బయో పిక్

తెరపైకి మరో బయో పిక్
x
Highlights

ఈ మధ్య కాలంలో యే భాషలోనైనా ఎక్కువగా సూపర్ హిట్ అయ్యే సినిమాలు బయో పిక్ సినిమాలే. మహానటి, ద ఐరన్ లేడీ, పాదయాత్ర, అంతే కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్...

ఈ మధ్య కాలంలో యే భాషలోనైనా ఎక్కువగా సూపర్ హిట్ అయ్యే సినిమాలు బయో పిక్ సినిమాలే. మహానటి, ద ఐరన్ లేడీ, పాదయాత్ర, అంతే కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న నేపథ్యంలో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమా, ప్రదానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్రలపై 'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్ లను తెరకెక్కించారు.

అదే నేపద్యంలో ఒకపుడు బీహార్‌ను తన కనుసైగలతో పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత చరిత్ర కుడా ఇప్పుడు బయో పిక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ గా కనిపించబోతున్నాడు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటిస్తుంది. తన చిన్నప్పటి నుంచి ఎలాంటి స్వభావం కలవాడో తన రాజకీయ చరిత్ర, పార్టీ విశేషాలను ఈ సినిమాలో చుపించాబోతున్నారు. ఈ సినిమాకు 'లాంతర్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ బీహార్, గుజరాత్‌లో జరగబోతోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని కుమార్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories