తాగిన మత్తులో ప్రాణాల మీదకు తెచ్చాడు

తాగిన మత్తులో ప్రాణాల మీదకు తెచ్చాడు
x
Highlights

బెంగుళూరులో భయంకరమైన యాక్సిడెంట్ మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో డ్రైవర్

బెంగళూరులో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. చూస్తండగానే జరిగిన ఘటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాగిన మైకంలో కారుడ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఎటు వెళ్లాలో కూడా తెలియక ఏకంగా పుట్‌పాత్‌పైకే ఎక్కిచేశాడు. దీంతో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వారిని బలంగా ఢీకోనడంతో వారంతా గాల్లోకి ఎగిరిపడ్డారు. యాక్సిడెంట్ షాకింగ్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో వైరల్‌గా మారింది.

స్థానిక హెచ్ఎస్ఆర్ లే అవుట్ ప్రాంతంలో మందుమత్తులో కారు నడిపాడో వ్యక్తి. రోడ్డుపై వస్తున్న కారు సడెన్‌గా ఫుట్‌పాత్‌ వైపు దూసుకురావడాన్ని గమనించిన వ్యక్తులు తప్పుకునే లోపు బలంగా ఢీకొనడంతో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్ధానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories