అయోధ్య వివాదంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

అయోధ్య వివాదంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
x
Highlights

అయోధ్య రామ జన్మభూమి రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌ 18 లోపు వాదనలు...

అయోధ్య రామ జన్మభూమి రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌ 18 లోపు వాదనలు పూర్తి చేస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఆ లోపే తీర్పును కూడా రిజర్వ్‌ చేస్తామని తెలిపారు. పిటీషనర్లు కోరితే మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మరోవైపు నవంబర్‌ 17 న సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఆ లోపే అయోధ్య వివాదానికి సంబంధించి తుది తీర్పు వెల్లడిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories