కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోడీకి ఆహ్వానం

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోడీకి ఆహ్వానం
x
Highlights

ముచ్చటగా మూడోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాం లీలా మైదానంలో ఫిబ్రవరి 16న అయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

ముచ్చటగా మూడోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాం లీలా మైదానంలో ఫిబ్రవరి 16న అయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ మేరకు ప్రధాని మోడీకి గురువారం ఆహ్వానం పంపించినట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై అధికారిక ప్రకటన వెలుబడాల్సింది.ఇక ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేబినేట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇక వేడుకకి మరే రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకులను ఆహ్వానించడం లేదని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ముందుగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని ఆప్ భావించింది. కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 08స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెర్చుకోలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories