అజిత్‌పవార్ వెన్నుపోటు పొడిచాడు: సంజయ్ రౌత్

అజిత్‌పవార్ వెన్నుపోటు పొడిచాడు: సంజయ్ రౌత్
x
సంజయ్ రౌత్
Highlights

అజిత్ పవార్‌పై శివసేన విమర్శలు చేసింది. బీజేపీ బెదిరించి అజిత్‌ను లొంగదీసుకుందని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈడీ ద్వారా అజిత్ పవర్‌ను బీజేపీ...

అజిత్ పవార్‌పై శివసేన విమర్శలు చేసింది. బీజేపీ బెదిరించి అజిత్‌ను లొంగదీసుకుందని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈడీ ద్వారా అజిత్ పవర్‌ను బీజేపీ భయపెట్టిందన్నారు. మహారాష్ట్ర ప్రజలను అజిత్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అధికారం కోసం ఫడ్నవీస్ ఏదైనా చేస్తారని చెప్పారు సంజయ్ రౌత్.

శరద్‌ పవార్‌ను అజిత్‌ మోసం చేశారని, దొంగదెబ్బ తీశారని దుయ్యబట్టారు. ఛత్రపతి శివాజీ వారసత్వమున్న మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు సరికాదన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ టచ్‌లోనే ఉన్నారని, వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడతారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో శరద్‌ పవార్‌కు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories