మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కరోనా టెస్టులు!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కరోనా టెస్టులు!
x
ManMohan Singh (File Photo)
Highlights

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న (ఆదివారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న (ఆదివారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. అయితే చికిత్సలో భాగంగా మన్మోహన్ సింగ్ కి వైద్యులు కొన్ని కొత్త మందులు ఇవ్వడంతో ఆయనకి జ్వరం వచ్చింది. దీనితో వెంటనే అప్రమత్తమైన వైద్యులు ముందు జాగ్రత్త లో భాగంగా కరోనా టెస్ట్ లు నిర్వహించారు.. అయితే ఆ టెస్ట్ లో మన్మోహన్ సింగ్ కి నెగిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories