దొంగతనం అంతా ఈజీ అనుకున్నావా ? ఓనర్ కి ఓ దొంగ లేఖ

దొంగతనం అంతా ఈజీ అనుకున్నావా ? ఓనర్ కి ఓ దొంగ లేఖ
x
Highlights

దొంగతనం కోసం ఓ కిరాణం షాప్ కి వెళ్ళాడు ఓ దొంగ అక్కడ అంతా వెతికినా కానీ ఒక్క రూపాయి కనిపించలేదు . దీనితో అతనికి బాగా కోపం వచ్చింది . ఎం చేయాలో తెలియక...

దొంగతనం కోసం ఓ కిరాణం షాప్ కి వెళ్ళాడు ఓ దొంగ అక్కడ అంతా వెతికినా కానీ ఒక్క రూపాయి కనిపించలేదు . దీనితో అతనికి బాగా కోపం వచ్చింది . ఎం చేయాలో తెలియక తన కోపాన్ని మొత్తం షాప్ ఓనర్ పైన తీర్చుకోవాలని ఓ లేఖ రాసాడు . ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే జయరామన్ అనే వ్యక్తి స్థానికంగా అక్కడ కిరాణం షాప్ నడుపుతున్నాడు .

అ ఏరియాలో అతనిదే బాగా నడిచే కిరాణం షాప్ కూడా .. ఈ విషయం అ దొంగ దృష్టిలో పడింది . ఓ రోజు అర్ధరాత్రి అతి కష్టం మీదా దుకాణంపై కప్పు తొలిగించి లోపలి ప్రవేశించాడు . అక్కడ ఎక్కడ చూసినా కిరాణం సామాగ్రి కనిపించడం తప్ప ఒక్క రూపాయి కూడా కనిపించలేదు . దీనితో తన అసహనాన్ని మొత్తం ఓ లేఖలో పేర్కొన్నాడు .

ప్రాణాలను లెక్క చేయకుండా దొంగతనం కోసం వస్తే కిరాణం కౌంటర్ లో ఒక్క రూపాయి కూడా పెట్టావా ? దొంగతనం అంటే అంతా ఈజీ అనుకున్నావా దానికోసం ఎంత శ్రమించాలో తెలుసా ? ఇందులో ఉన్న సామాను తీసుకెళ్ళి ఎం చేసుకోవాలి అని రాసాడు . పొద్దున షాప్ తెరిచినా అ షాప్ ఓనర్ కి పై కప్పు ఓపెన్ చేసి ఉండడంతో దొంగతనం జరిగిందని అనుమానం వచ్చి మొత్తం చూడగా ఈ లెటర్ మాత్రమే దొరికింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories