ప్రేమంటే నీదే బ్రదర్ : ప్రియురాలు శవంతో పెళ్లి

ప్రేమంటే నీదే బ్రదర్ : ప్రియురాలు శవంతో పెళ్లి
x
Highlights

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అందరిలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారి భవిష్యత్తుపై కలలు కన్నారు. బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకోవాలని...

వారిద్దరూ ప్రేమించుకున్నారు. అందరిలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారి భవిష్యత్తుపై కలలు కన్నారు. బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకోవాలని అనుకున్నారు. కానీ క్యాన్సర్ అనే భూతం వారి కలలని కల లాగే మిగిల్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన జూ షినాన్, యాంగ్ లియూ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవడం కోసం 2013 లో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు కూడా అంగీకారం కూడా తెలిపింది. కానీ ఇంతలో యాంగ్ లియూకి క్యాన్సర్ వ్యాధి సోకింది. నాలుగేళ్ల పాటు ఆమెకి శస్త్ర చికిత్సతో పాటు కీమోథెరపీ కూడా చేశారు. ఆమె మళ్ళీ కోలుకుంటుంది అన్న క్రమంలో మళ్ళీ క్యాన్సర్ అటాక్ చేసింది. మళ్ళీ చికిత్స మొదలుపెట్టారు కానీ 2019 అక్టోబర్ 6న ఆమె కోమాలోకి వెళ్లి ఇటివలే చనిపోయింది.

ఇక ఆమె చివరి కోరికను గుర్తుచేసుకున్నా జూ షినాన్ తన ప్రియురాలుకి ఇష్టమైన పెళ్లి గౌనును ఆమె మృతదేహానికి ధరించి వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. నిజమైన ప్రేమకి అర్ధం చెప్పావ్ అని కొనియాడుతున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories