బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌.. బీజేపీకి ఇక రోజులు దగ్గరపడ్డాయి: మమతా బెనర్జీ

బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌.. బీజేపీకి ఇక రోజులు దగ్గరపడ్డాయి: మమతా బెనర్జీ
x
Highlights

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా జరిగిన మూడు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను...

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా జరిగిన మూడు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్‌ కైవసం చేసుకుంది.

ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజకీయ అహంకారానికి బెంగాల్ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని చెప్పారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories