హిమాచల్‌ బస్సు ప్రమాదంలో 25 మంది మృతి

హిమాచల్‌ బస్సు ప్రమాదంలో 25 మంది మృతి
x
Highlights

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయిన ఘటనలో 25 మంది మృతిచెందారు. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు...

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయిన ఘటనలో 25 మంది మృతిచెందారు. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. రెస్య్కూ టీం 25 మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీసింది. ఈ ఘటనలో 35 మందికి గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు కుల్లూ జిల్లా ఎస్పీ శాలిని అగ్నిహోత్రి తెలిపారు. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. కుల్లూ జిల్లాలోని బంజర్‌-గడగుశని మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు కులు జిల్లాలోని బంజర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories