ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది మృతి
x
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది..వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది..వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.ఔరాయా జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రస్తుతం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ సంఘటనకు కొద్దీ రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్తుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌- సహరాన్‌పుర్‌ రహదారిపై అదే రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆరుగురు కూలీలపై దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు. లాక్ డౌన్ వలన పలు రాష్ట్రంలో చిక్కుకున్న వలస కూలీలు తిరిగి ఇంటికి పయనం అవుతున్న సమయంలో దారుణం చోటు చేసుకోవడం అందరిని కలిచి వేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories