'అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు'.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు..

2 Years Ago Shraddha Walkar Written the Complaint to the Cops
x

‘అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు’.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు..

Highlights

Shraddha Walkar: దేశ రాజధాని ఢిల్లీ మెహ్‎రోలీ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొకి వస్తున్నాయి.

Shraddha Walkar: దేశ రాజధాని ఢిల్లీ మెహ్‎రోలీ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొకి వస్తున్నాయి. శ్రద్ధాను కిరాతంగా హత్య చేసి 35 ముక్కలుగా కోసి విసిరేసిన నిందితుడు ఆప్తాబ్.. తనను చంపి ముక్కలు చేస్తాడని రెండేళ్ల క్రితం నుంచి బెదిరిస్తున్నాడని శ్రద్ధా పోలీసులకు రాసిన ఓ లేఖతో వెలుగులోకి వచ్చింది. ఆప్తాబ్ వేధింపులపై గత రెండేళ్ల క్రితమే శ్రద్ధా మహారాష్ట్ర పోలీసులకు లేఖ రాసినట్లు విచారణ అధికారులు గుర్తించారు.

అఫ్తాబ్‌ క్రూరత్వం, బెదిరింపులను వివరిస్తూ.. 2020 నవంబరు 23న శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అఫ్తాబ్ తనను కొడుతున్నాడనీ, కట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడని లేఖలో వివరించింది. ఈ విషయం బయటకు చెబితే.. చంపేసి ముక్కలుగా నరికిపారేస్తానని బెదిరించాడని లేఖలో ఫిర్యాదు చేసింది. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం ఆప్తాబేనని స్పష్టం చేసింది. తనను చంపుతాడన్న భయంతోనే ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయడానికి వెనకాడాల్సి వస్తోందని లేఖలో శ్రద్ధా ప్రస్తావించింది. పోలీసులు స్పందించకుంటే తనకు హాని జరిగే ఛాన్సుందిని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories