Tamilnadu: మద్యం మత్తులో స్నేహితుని ఐదేళ్ళ చినారిపై అఘాయిత్యం

Tamilnadu: మద్యం మత్తులో స్నేహితుని  ఐదేళ్ళ చినారిపై అఘాయిత్యం
x
Highlights

ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని బాధలని, కష్టాలని చెప్పుకునేది కేవలం స్నేహితులకు మాత్రమే. కాని ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో కూడా తెలియని పరిస్థితి. స్నేహితులని తన ఇంటికి నమ్మి తీసుకెళితే వారే తమ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. స్నేహితుడు అనే పదానికి వున్న విలువను తీసేస్తున్నారు.

ప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని బాధలని, కష్టాలని చెప్పుకునేది కేవలం స్నేహితులకు మాత్రమే. కాని ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో కూడా తెలియని పరిస్థితి. స్నేహితులని తన ఇంటికి నమ్మి తీసుకెళితే వారే తమ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. స్నేహితుడు అనే పదానికి వున్న విలువను తీసేస్తున్నారు. ఇదే కోణంలో తన స్నేహితులని ఇంటికి తీసుకు వస్తే ఆ మద్యం మత్తులో ఆ యువకులు అతని ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే గోపాలపురానికి చెందిన ఓ యువకుడు తన మిత్రులు కార్తి, మురుగన్‌లతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరినీ తన ఇంటికి తీసుకోచాడు. అప్పుడు తన మిత్రుడి ఐదేళ్ల కూతురిని చూసిన కార్తి, మురుగన్‌లు చాక్లెట్ కొనిస్తాం రమ్మంటూ చిన్నారిని బయటకు తీసుకెళ్లారు. రెండు గంటలైనా వారు చిన్నారిని ఇంటికి తీసుకురాలేదు. దీంతో అనుమానం వచ్చిన చిన్నారి తండ్రి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు.

అదే సమయంలో ఒక చోట చిన్నారి ఏడుస్తూ కనిపించింది. దీంతో తన దగ్గరికి వెళ్ళిన తండ్రి విషయాన్ని తెలుసుకున్నాడు. తన కూతురు చెప్పిన విషయాన్ని విన్న తండ్రి కోపంతో ఊగిపోయాడు. అదే కోపంలో కార్తిని పట్టుకుని కత్తితో నరికి చంపాడు. అది చుసిన మరో మిత్రుడు మురుగన్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories