ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్
x
Highlights

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్...

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరైంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తోంది. అయితే ఈ నెల 16న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేయడంతో మరి కొంత కాలం జైల్లోనే గడపనున్నారు. ఈనెల 24 వరకు ఈడీ అధికారులు చిదంబరంను విచారించనున్నారు. ఈడీ కేసులో బెయిల్ లభిస్తేనే చిదంబరం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories