ముంబయి ఇక 24×7.. కేబినెట్‌ ఆమోదం

ముంబయి ఇక 24×7.. కేబినెట్‌ ఆమోదం
x
ముంబయి ఇక 24×7.. కేబినెట్‌ ఆమోదం
Highlights

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇకపై షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, మల్టీఫ్లెక్స్‌లు 24 గంటలు తెరిచి ఉంచనున్నారు. ముంబయి ప్రజలు రాత్రిపూట కూడా...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇకపై షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, మల్టీఫ్లెక్స్‌లు 24 గంటలు తెరిచి ఉంచనున్నారు. ముంబయి ప్రజలు రాత్రిపూట కూడా ఆహారాన్ని తినొచ్చు, సినిమాలు చూడొచ్చు. ముంబైలో మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు వంటివి 24 గంటలూ తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనకు మహారాష్ట్ర సర్కార్ లైన్ క్లియర్ చేసింది. సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 27 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేసింది.

ముంబైలో 24X7 పేరుతో స్టార్ట్ చేస్తున్న ఈ విధానాన్ని సిటీ మొత్తం అమలు చేయడంలేదని తెలిపారు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ సహా పలు నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్, మల్టీపెక్స్‌లు, హోటళ్లు 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు. అయితే ఇలా తెరవాలా వద్దా అన్నదానిపై బలవంతం ఏమీ లేదని, ఆయా సంస్థల యజమానుల ఇష్టమని చెప్పారు. 24 గంటలూ మాల్స్, హోటల్స్ వంటివి ఓపెన్ చేసి ఉంచడం వల్ల సిటీకి వచ్చే పర్యాటకులకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

తొలిదశలో మాల్స్‌లోని థియేటర్లు, మిల్‌ కాంపౌండ్స్‌కు అనుమతిస్తున్నట్లు ఆదిత్య ఠాక్రే తెలిపారు. బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌, నారీమన్‌ పాయింట్‌లోని ఫుడ్‌ ట్రక్స్‌కు అనుమతిస్తామన్నారు. రాత్రిపూట షిఫ్టులు పూర్తిచేసుకొచ్చిన వారు, పర్యాటకులు రాత్రి 10 దాటిన తర్వాత ఆకలేస్తే వారి పరిస్థితేంటని, అలాంటి వారికి ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం లభిస్తుందన్నారు. పబ్బులు, బార్లు మాత్రం యథావిధిగా 1.30 గంటలకే మూతపడతాయని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories