భారత్ గెలవాలి.. పాకిస్తాన్ ఫాన్స్ ..

భారత్ గెలవాలి.. పాకిస్తాన్ ఫాన్స్ ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మంచి దూకుడును ప్రదర్శిస్తుంది . టైటిల్ లక్ష్యంగా ఆడినా ప్రతి మ్యాచ్ లో గెలుచుకుంటూ వస్తుంది . అయితే ఇందులో భాగంగానే రేపు...

ప్రపంచ కప్ లో భాగంగా భారత్ మంచి దూకుడును ప్రదర్శిస్తుంది . టైటిల్ లక్ష్యంగా ఆడినా ప్రతి మ్యాచ్ లో గెలుచుకుంటూ వస్తుంది . అయితే ఇందులో భాగంగానే రేపు భారత్ ఆతిధ్య జట్టు అయిన ఇంగ్లాండ్ తో సమరానికి సిద్దం అవుతుంది . ఇప్పటికే సెమిస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నా భారత్ ఇంగ్లాండ్ ని ఓడించి మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని చూస్తుంది . అయితే ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని కోరుకుంటున్నారు పాకిస్థాన్ అభిమానులు .. ఎందుకంటే పాకిస్థాన్ సెమిస్ కి చేరాలంటే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలిచి తీరాలి ..

ఇప్పటికే భారత్ తో మ్యాచ్ ఓడిపోయాక పాకిస్థాన్ అన్ని విభాగాల్లో పుంజుకుంది . వరుసగా రెండు మ్యాచ్ లో గెలిచి సత్తా చాటింది . అయితే భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ లో మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ పాక్ ఫాన్స్ కి ట్యాగ్ చేస్తూ సరదాగా ట్వీట్ చేసాడు . ఐతే ఇందులో చాలా మంది ఇండియాకి సపోర్ట్ చేయడం విశేషం .. ఇక్కడ మరో విషయం ఏంటంటే కొందరు పాకిస్థాన్ అభిమానులు కూడా జై హింద్ .. వందేమాతరం అని పోస్ట్ లు పెట్టారు ..



Show Full Article
Print Article
Next Story
More Stories