జబర్దస్త్ షోకి పర్మినెంట్ జడ్జీ దొరికేది ఎప్పుడు?

జబర్దస్త్ షోకి పర్మినెంట్ జడ్జీ దొరికేది ఎప్పుడు?
x
Highlights

ఓ పదిహేను ఎపిసోడ్స్ చేసి వదిలేద్దాం అనుకున్న జబర్దస్త్ షో అంచలంచలుగా ఎక్కడికి ఎదిగిపోయింది.

ఓ పదిహేను ఎపిసోడ్స్ చేసి వదిలేద్దాం అనుకున్న జబర్దస్త్ షో అంచలంచలుగా ఎక్కడికి ఎదిగిపోయింది. మరో షో, సీరియల్స్ కూడా బీట్ చేయని టీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ షోలో స్కిట్స్ చేసిన కమెడియన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా హీరోలు కూడా అయిపోయారు. జబర్దస్త్ ఇట్స్ నాటే షో .. ఇట్స్ ఎ బ్రాండ్ అన్న స్టేజీకి వెళ్ళిపోయింది. ఇంత మంచి హిట్టు అయిన ఈ షోకి కమెడియన్స్, షో నిర్వాహకులు మాత్రమే కారణం కాదు. జడ్జీలు కూడా కారణమే..

నాగబాబు, రోజా ఇద్దరు కలిసి షో మొదటి నుంచి జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మధ్య మద్యలో వేరే వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళ ప్లేస్ కేవలం టెంపరరీగా మాత్రమే మిగిలిపోయారు. ఇప్పుడు ఈ షోకి మెయిన్ పిల్లర్ అయిన నాగబాబు షో కి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు జీ తెలుగులో అదిరింది అనే ప్రోగ్రాం చేస్తున్నారు. అయితే నాగబాబు ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు పలానా వాళ్ళు వస్తున్నారని చాలా పేర్లు వినిపించాయి. కానీ అవి కేవలం వార్తల వరకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రోజుకొక్క జడ్జీ వస్తున్నారు పోతున్నారు కానీ పరిమినెంట్ గా సెట్ అయింది మాత్రం ఎవరు లేరు.

అలీ, తరుణ్ భాస్కర్ చెరో రెండో ఎపిసోడ్స్ లకి వచ్చారు.. ఇక పోసాని ఎక్స్ ట్రాకు వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు అన్నది తెలియదు. వచ్చిన వాళ్ళు కూడా నాగబాబు ప్లేస్ ని రీప్లేస్ మాత్రం చేయడం లేదు. అయన లేని లోటు అభిమానులకి స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగైనా నాగబాబు ప్లేస్ ని రీప్లేస్ చేసే వారిని పట్టుకోవాలని షో నిర్వాహకులు కూడా గట్టిగానే అనుకుంటున్నారు. చూడలి మరి ఎవరు వస్తారో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories