ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ రంభ, రాశి... ప్రస్తుతం సినిమాలు చేయడం ఆపేసి బుల్లితెరపై కనిపిస్తున్నారు.. ఇవే కాకుండా...
ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ రంభ, రాశి... ప్రస్తుతం సినిమాలు చేయడం ఆపేసి బుల్లితెరపై కనిపిస్తున్నారు.. ఇవే కాకుండా వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు కలర్స్ అనే వాణిజ్య ప్రకటన చేసారు. ఇందులో బరువు తగ్గడం ఈజీ అనే చెప్పే ప్రకటన.. అయితే దీనిపైన విజయవాడ కోర్టు సీరియస్ అయ్యింది.
కలర్స్ వెయిట్ లాస్ ప్రకటన చూసి మోసపోయానని విజయవాడకి చెందిన ఓ వ్యక్తి స్థానిక కన్జూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును పరిశీలించిన కోర్టు కలర్స్ వెయిట్ లాస్ కి జరిమానా విధిస్తూ కస్టమర్ పే చేసిన డబ్బులకు గాను 9 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని చెప్పుకొచ్చింది. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చారు. అంతేకాకుండా రాశి, రంభ నటించిన యాడ్స్ పై నిషేధం విధించింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు ఆలోచించుకోవాలని తారలకు హెచ్చరించింది కోర్టు .
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire