రష్మిక కంటే విజయశాంతి రెమ్యునరేషనే ఎక్కువట?

రష్మిక కంటే విజయశాంతి రెమ్యునరేషనే ఎక్కువట?
x
Highlights

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో

ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ రోల్ లో కనిపించనున్నారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11వ విడుదల చేస్తున్నారు.

ఇక ఈ సినిమాతో దాదాపుగా 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ లలో ఆమెకి సంబంధించిన లూక్స్ , ఆమె చెప్పిన డైలాగ్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమాకి గాను ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఫిలం నగర్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాకి గాను రష్మికకి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వగా, విజయశాంతికి కోటిన్నర ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పెద్ద బ్యానర్, స్టార్ హీరో, కీలకమైన పాత్ర, తన రీ ఎంట్రీ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించనున్నాడు. సంగీత, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. భరత్ అను నేను, మహర్షి లాంటి సినిమాల తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories