చిరంజీవి మాటలతో నా విలువ మరింత పెరిగింది: విజయశాంతి

చిరంజీవి మాటలతో నా విలువ మరింత పెరిగింది: విజయశాంతి
x
Highlights

టాలీవుడ్ హిట్టు పెయిర్ లలో చిరంజీవి, విజయశాంతి ఒకటి.. దాదాపుగా వీరిద్దరూ కలిసి 20 సినిమాల్లో కలిసి నటించారు.

టాలీవుడ్ హిట్టు పెయిర్ లలో చిరంజీవి, విజయశాంతి ఒకటి.. దాదాపుగా వీరిద్దరూ కలిసి 20 సినిమాల్లో కలిసి నటించారు. 'సంఘర్షణ' సినిమాతో మొదలైన వీరి ప్రయాణం చాలెంజ్, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం, స్వయంకృషి, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఇద్దరి మధ్య కొంచం గ్యాప్ ఏర్పండిది.

చిరంజీవి రాజకీయాల్లోకి లేట్ గా వెళ్ళిన ముందుగానే రీఎంట్రీ ఇచ్చారు. ఇక విజయశాంతి లేటెస్ట్ గా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ వేడుకలో చిరంజీవి తన హీరోయిన్ విజయశాంతితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి విజయశాంతిని లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ అంటూ ప్రశంసించారు చిరు.. ఆ వేడుకలో చిరంజీవి మాట్లాడిన మాటలకి గాను విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నానని విజయశాంతి పోస్ట్ చేశారు.

"నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే... కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో... నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను "గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక" అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా... లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా... ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. "సరిలేరు నీకెవ్వరు" దర్శకుడు రావిపూడి గారితో పాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని పోస్ట్ పెట్టారు విజయశాంతి

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ సినిమా షూటింగ్ కోకాపేటలో మొదలైంది. ఈ సినిమాలో విజయశాంతి కూడా ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ , కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories