గ్యాంగ్ స్టర్ గా మహేష్ .. మరో హీరోతో దోస్తీ ?

గ్యాంగ్ స్టర్ గా మహేష్ .. మరో హీరోతో దోస్తీ ?
x
Highlights

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాని...

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు. ఇది మహేష్ కి 27వ సినిమా కావడం విశేషం..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మహేష్ ఎలా కనిపించనున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ ఓ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నాడని, పక్కా యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరక్కుతుందని తెలుస్తోంది. మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించడం అన్నది ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలో గ్యాంగ్ స్టర్ గానే నటించాడు. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మళ్ళీ ఇలా మహేష్ కనిపించింది లేదు. దీనితో మహేష్ కోసం ఇలాంటి కథని డిజైన్ చేశారట వంశీ.

అయితే ఈ సినిమాలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నాడని తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్ కోసం వంశీ విజయ్ దేవరకొండని సంప్రదించాడని వినికిడి . ఈ పాత్ర సినిమాకి కీలకం కానుందని సమాచారం. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్ ,వంశీ కాంబినేషన్ లో మహర్షి అనే సినిమా వచ్చి మంచి ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక సంక్రాంతికి రిలీజైన సరిలేరు నీకెవ్వరు మంచి టాక్ ని సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలకపాత్రలో కనిపించారు. సంగీత, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories