మళ్లీ మురిపిస్తున్నారు

మళ్లీ మురిపిస్తున్నారు
x
Highlights

రష్మిక, విజయ్ దేవరకొండ మళ్లీ మురిపిస్తున్నారు. గీతాగోవిందం అందాల్ని ప్రేక్షకులు మర్చిపోక ముందే మరోసారి డియర్ కామ్రేడ్ కోసం జత కట్టరిద్దరూ. ఆ సినిమాలో...

రష్మిక, విజయ్ దేవరకొండ మళ్లీ మురిపిస్తున్నారు. గీతాగోవిందం అందాల్ని ప్రేక్షకులు మర్చిపోక ముందే మరోసారి డియర్ కామ్రేడ్ కోసం జత కట్టరిద్దరూ. ఆ సినిమాలో చేసిన మేజిక్ ను మళ్లీ రిపీట్ చేయడానికి సిద్ధం అయిపోయారు. భరత్ కమ్మ దర్శకత్వం లో వస్తోన్న డియర్ కామ్రేడ్ సెకండ్ సింగిల్ విడుదల చేసింది చిత్ర బృందం.

"కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే .. ఒడి చేరి ఒకటైపోయే .. తీరం కోరే ప్రాయం .. " అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ యువతకు గిలిగింతలు పెట్టేలా సాగింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ గానంతో ఈ పాట వీనుల విందుగా ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన మెలోడీ పాటల్లో ఇదొక మంచి పాటగా నిలుస్తుందని చెప్పొచ్చు.

అయితే, ఈ పాటకు సంబంధించి విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. విజయ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'ఒక రోజు ఉదయం నేను నిద్రలో నుంచి మేల్కొన్న వెంటనే భరత్ నుంచి నాకొక మెసేజ్ వచ్చింది. అది ఆడియో ఫైల్. నేను విన్నాను. చాలా భావోద్వేగానికి గురయ్యాను. కళ్లలో నీల్లొచ్చాయి. నేను ఈ పాటను ఇంట్లో ప్లే చేసిన ప్రతిసారీ మా అమ్మ కళ్లలో నీళ్లు చూశాను. ప్రస్తుతం ఈ పాట మీది, ఆస్వాదించండి' అని ట్వీట్‌లో విజయ్ పేర్కొన్నారు. విజయ్ చెప్పినదాన్ని బట్టి ఈ పాట ఆయనకు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో తెలుస్తోంది. ఆయనకే కాదు ఆయన తల్లికి కూడా.

Show Full Article
Print Article
Next Story
More Stories