'మిస్ మ్యాచ్' వేడుకకి వెంకటేష్

మిస్ మ్యాచ్ వేడుకకి వెంకటేష్
x
'మిస్ మ్యాచ్' ఫైల్ ఫోటో
Highlights

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'.

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరగనుంది. దీనికి ముఖ్య అతిధిగా టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హాజరు కానున్నారు. వెంకటేష్ తో పాటు ఈ వేడుకకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మంత్రి హరీష్ రావు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ హాజరు కానున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాలోని ఏ మనసే.. సే.. సే.. అనే సాంగ్ ని రీమేడ్ చేసారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ కి అంకితం ఇస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

కధ: భూపతి రాజా,

మాటలు: రాజేంద్రకుమార్, మధు,

ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర,

పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ,

కళా దర్శకుడు: మణి వాసగం,

దర్శకుడు: ఎన్.వి.నిర్మల్ కుమార్,

నిర్మాతలు: జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్






Show Full Article
Print Article
More On
Next Story
More Stories