శ్రీనివాస కళ్యాణం లాంటి ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేశాడు హీరో నితిన్... పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
శ్రీనివాస కళ్యాణం లాంటి ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని భీష్మ అనే సినిమాని చేశాడు హీరో నితిన్... పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సీతార ఎంటర్టైన్మెంట్ సినిమాని నిర్మించింది. సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది.
ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి. దీనితో సినిమా మొదటి రోజు రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే నితిన్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డు సృష్టించాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని ఏర్పాటుచేసింది. నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చిన సందర్భంలో నితిన్ భాగోద్వేగానికి లోనయ్యాడు కూడా..
ఇక ఈ శుక్రవారం థ్యాంక్స్ మీట్ను ఏర్పాటుచేయనుంది చిత్ర యూనిట్. వైజాగ్లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని సీతార ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాని చూసిన వరుణ్ తేజ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపాడు.
We are happy to inform you all that, Mega Prince @IAmVarunTej garu will be gracing the #BlockbusterBheeshma Thanks Meet event as Chief Guest at Gurajada Kalakshetram, Vizag on 29th Feb!! 🤩😍 @actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh pic.twitter.com/DoXR7a6w4G
— Sithara Entertainments (@SitharaEnts) February 27, 2020
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నితిన్ ఆ తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire