వర్మ ట్వీట్: కేఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ స‌ర్టిఫికెట్

వర్మ ట్వీట్: కేఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ స‌ర్టిఫికెట్
x
రామ్ గోపాల్ వర్మ
Highlights

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు".

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు".. ముందుగా ఈ సినిమాకి క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అని పెట్టినప్పటికీ సినిమా టైటిల్ పై పలు వివాదాలు తలెత్తడంతో టైటిల్ ని మార్చేశారు. నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నప్పటికీ సెన్సార్ స‌మ‌స్యల వ‌ల‌న సినిమా విడుదల కాలేకపోయింది.

దీనితో తెలంగాణా హైకోర్టులో వర్మ ఫిటిషన్లు దాఖలు చేయడం, ఆ తర్వాత సెన్సార్ బోర్డు సినిమాని చూసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడం, వర్మ రివైజింగ్ కమిటీకి వెళ్ళడం, రివైజింగ్ కమిటీ నుంచి క్లియన్స్ లభించడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.. ఈ సినిమాకి కొన్ని కట్స్‌తో 'యు.ఏ' సర్టిఫికెట్‌ను లభించింది. దీనితో ఈ సినిమా డిసెంబ‌ర్ 12న విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

అయితే తాజాగా దర్శకుడు వర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకుంటున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోని త‌న ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాని రిలీజ్ చేయొద్దని కేఏ పాల్ కోర్టులో పిటీష‌న్ వేసిన సంగతి తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనల ఆధారంగా వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు ట్రైలర్స్ సినిమాపైన చాలా వివాదాలను క్రియేట్ చేశాయి. సినిమా విడుదలయ్యాక మరెన్ని సంచనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి మరి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories