చిరు మూవీ లైన్ తో ఎన్టీఆర్ తో సినిమా ?

చిరు మూవీ లైన్ తో ఎన్టీఆర్ తో సినిమా ?
x
Ntr, Trivikram
Highlights

తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ... ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేసేందుకు సిద్దమయ్యాడు.

తాజాగా 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ... ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేసేందుకు సిద్దమయ్యాడు. ఇది ఎన్టీఆర్ కి 30 వ చిత్రం కాగా, త్రివిక్రమ్ కి 12 వ సినిమా.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై కే రాధాకృష్ణ, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం వచ్చి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే..

త్రివిక్రమ్ సినిమాలు అన్ని ఎక్కడినుంచో ప్రేరణ పొందినవే.. నితిన్ తో చేసిన 'అ ఆ' సినిమా 'మీనా' నవలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించినదే.. ఇక 'అజ్ఞాతవాసి' సినిమాకు ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్' బేస్ చేసుకొని తీసిందే.. తాజాగా 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని ఇంటిగుట్టు ఆధారంగా తెరకెక్కించాడన్న ఆరోపనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని చిరంజీవి హీరోగా నటించిన 'మంత్రిగారి వియ్యంకుడు' నుంచి లైన్ ని తీసుకొని తెరకేక్కిస్తున్నాడని ఫిలిం నగర్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తోంది.

బాపు దర్శకత్వంలో 1983 లో రిలీజైన 'మంత్రిగారి వియ్యంకుడు' మంచి హిట్ అయింది. ఈ సినిమా మూలకథనే బేస్ చేసుకొని ఎన్టీఆర్ తో సినిమాని తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం.. అయితే ఎక్కువగా పొలిటికల్ గా కాకుండా ఎంటర్టైన్మెంట్ బేస్ లోనే సినిమాని తెరకెక్కనుందని సమాచారం.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులైలో పట్టలేక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస పూజా హేగ్దే హీరోయిన్ గా నటించనుందని సమాచారం...తమన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ...

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories