'రాధే శ్యామ్'గా బాహుబలి!

రాధే శ్యామ్గా బాహుబలి!
x
Prabhas, Pooja Hegde (file Photo)
Highlights

గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్..

గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ప్రభాస్ కి ఇది 20వ సినిమా కావడం విశేషం.. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా వైర‌స్ ప్రభావంతో ఆగిపోయింది. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి 'రాధేశ్యామ్' లేదా 'ఓ డియర్' అనే పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ జార్జియాలో జ‌రుపుకుంది. ఆ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు పూజాహెగ్డే, ప్రియదర్శిలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం కోసం ముందుగా 'జాన్' అనే టైటిల్ ని పరిశీలించారు. అయితే, తమిళ చిత్రం 96 రీమేక్ గా తెలుగులో శర్వానంద్, సామంత హీరో హీరోయిన్ గా తెలుగులో 'జనూ' పేరుతో విడుద‌లైంది. రెండు టైటిల్స్ ఒకేలా ఉండటంతో చిత్ర బృందం 'ఓ డియ‌ర్' అనే టైటిల్‌ని ప్రభాస్ సినిమాకి ఫిక్స్ చేస్తారని అన్నారు. కనీ.. తాజా సమాచారం ప్రకారం కాని తాజా స‌మాచారం ప్ర‌కారం 'రాధేశ్యామ్' అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు సమాచారం. త్వరలోనే దేనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయనున్నారు చిత్ర బృందం.

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు ఆగిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్ప‌ట్లో విదేశాల‌కి వెళ్లే ఛాన్స్ లేక‌పోవ‌డంతో లాక్‌డౌన్ త‌ర్వాత ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోనే ఫారెన్ మాదిరి సెట్స్ వేసి కీల‌క స‌న్నివేశాలను తెరకేక్కిస్తారని సమాచారం. ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించి సంబందించి అధికారిక ప్రకటన కూడా దర్శక నిర్మాతలు విడుదల చేసిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories