మహేష్ నిర్మాతగా విజ‌య్, కార్తీ సినిమాలు

మహేష్ నిర్మాతగా విజ‌య్, కార్తీ సినిమాలు
x
Mahesh Babu (File Photo)
Highlights

హీరోలే నిర్మాతగా మారుతున్న రోజులివి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నుంచి నాని, విజయ్ దేవరకొండ వరకు అందరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హీరోలే నిర్మాతగా మారుతున్న రోజులివి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నుంచి నాని, విజయ్ దేవరకొండ వరకు అందరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ తన సినిమాలకి మాత్రమే నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు తన నిర్మాణరంగంలో వేరే హీరోల సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగాంగానే ఇప్పటికే అడివి శేషుతో మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఇక ఈ సినిమా తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు మహేష్... ఇప్ప‌టికే విజ‌య్‌తో చ‌ర్చ‌లు కూడా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి దిల్ రాజు మరో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని సమాచారం.. దీని తరవాత తమిళ్ హీరో కార్తీతో సినిమాలను చేసేందుకు మహేష్ ప్లాన్ చేస్తున్నాడట.. అన్ని ఒకే అయితే ఈ సినిమాలు ఈ ఏడాది లొనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపైనే అధికార ప్రకటన వెలువడనుంది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. మహేష్ 27 వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా పట్టాలెక్కనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories