తెలంగాణ విప్లవంపై ఓ సినిమా చేద్దాం అనుకున్నా : సుకుమార్

తెలంగాణ విప్లవంపై ఓ సినిమా చేద్దాం అనుకున్నా : సుకుమార్
x
Sukumar (File Photo)
Highlights

సుకుమార్ ... తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు..

సుకుమార్ ... తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.. చేసిన కొన్ని సినిమాలు అయినప్పటికీ స్టార్ దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. రామ్ చరణ్ తో చేసన రంగస్థలం సినిమా తరవాత తెలంగాణ విప్లవం గురించి అనేక పుస్తకాలు చదివాడట! రంగస్థలం తరువాత దాని మీద సినిమాగా తీయాలని అనుకున్నానాడట.. కానీ ఇతర కారణాల వల్ల ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టి వేరే స్క్రిప్ట్ మీద పని చేయటం మొదలుపెట్టానని సుకుమార్ వెల్లడించారు. ఓ స్టైలిష్ దర్శకుడు తెలంగాణ తెలంగాణ విప్లవం పైన సినిమాపైన తీయాలని అనుకోవడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది!

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ ని హీరోగా 'పుష్ప' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే... ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం..

గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నా రు.ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories