రీఎంట్రీ ఎవరికీ ప్లస్ అయింది?

రీఎంట్రీ ఎవరికీ ప్లస్ అయింది?
x
Highlights

ఇద్దరు ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారే.. కానీ ఆ తర్వాత కాస్తా బ్రేక్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలతో రీఎంట్రీ ఇచ్చారు.

ఇద్దరు ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారే.. కానీ ఆ తర్వాత కాస్తా బ్రేక్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలతో రీఎంట్రీ ఇచ్చారు. వారే విజయశాంతి, టబు..వీరి రీఎంట్రీ ఉండడంతో అభిమానుల్లో అంచనాలు ఇంకో లెవల్ లో ఉన్నాయి. మరి ఇందులో ఆ అంచనాలను ఎవరు అందుకున్నారు. ఎవరికీ రీఎంట్రీ ప్లస్ అయింది అన్నది ఇప్పుడు చూద్దాం..

విజయశాంతి :

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో 13 ఏళ్ల తర్వాత మొఖానికి మేకప్ వేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయశాంతి. ప్రతి ఘటన, కర్తవ్యం లాంటి సినిమాలలో పవర్ ఫుల్ పాత్రలను పోషించిన విజయశాంతికి ఇందులో కూడా భారతి అనే పవర్ ఫుల్ పాత్రే దక్కింది. అభిమానుల అంచనాలను ఎక్కడ మిస్ చేయకుండా నటించింది విజయశాంతి. మహేష్ తర్వాత సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రగా ఆమె పాత్ర నిలిచిపోయింది. కానీ చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర కాదు కానీ ఆమెకి మరిన్ని అవకాశాలు రావడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ సినిమా మొత్తంగా మీద చూస్తే విజయశాంతికి మంచి రీ ఎంట్రీ దక్కినట్టే

టబు :

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ద్వారా తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది టబు.. ఆమె పాత్ర పెద్ద లెంత్, ఇంపార్టెంట్ ఉన్న రోల్ అయితే కాదనే చెప్పాలి. సినిమాలో అన్ని పాత్రలలో అమేదో పాత్ర లాగా మిగిలిపోయింది తప్ప ప్రత్యేకంగా ఏమి లేదని చెప్పాలి.. ఆమె వల్ల సినిమాకి వచ్చిన ప్లస్ అయితే కొత్తగా ఏమి లేదు. కానీ ఆమె పాత్ర మేరకు ఆమె పూర్తి న్యాయం చేసారనే చెప్పాలి. చూడాలి మరి ఆమెకి భవిషత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో..

ఇక ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలు మంచి టాక్ ని సంపాదించుకున్నాయి. మహేష్ సినిమాకి మాస్ టాక్ రాగా, అల్లు అర్జున్ సినిమాకి క్లాస్ టాక్ వచ్చింది.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోటి పడుతున్నాయి ఈ రెండు సినిమాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories