కరోనా కట్టడికి సాయికుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల విరాళం

కరోనా కట్టడికి సాయికుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల విరాళం
x
Sai Kumar And Aadhi
Highlights

కరోనా వైరస్ అని అరికట్టడానికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే..

కరోనా వైరస్ అని అరికట్టడానికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలకి ఆర్ధిక సహాయం చేయడానికి సినీ, క్రీడా, వాణిజ్య ప్రముఖలు ముందుకు వచ్చి అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ముందుకు వచ్చి భారీ విరాళాలను ప్రకటించారు. ఇక సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వలన సినీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది..

వీరని ఆదుకోవడం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ అండ‌గా నిలిచింది. ఈ ఛారిటీకి హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. తాజాగా నటుడు సాయికుమార్ ఆయన కుమారుడు హీరో ఆది సాయి కుమార్ ఈ జాబితాలోకి చేరారు.. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 5 లక్షల 4 రూపాయలను విరాళంగా అందజేసారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయి కుమార్ తన వంతుగా రూ.1 లక్ష 8 రూపాయలను విరాళంగా అందజేశారు.

వారు మాత్రమే కాకుండా సాయికుమార్ తమ్ముడు బొమ్మాళీ రవిశంకర్ తన వంతుగా రూ. లక్ష రూపాయలను విరాళంగా అంద‌జేసారు. మొత్తంగా సాయి కుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల 12 రూపాయాలను విరాళం అందజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories