ప్రభాస్ ఫ్యాన్స్‌కు యువీ క్రియేష‌న్స్ విజ్ఞప్తి

ప్రభాస్ ఫ్యాన్స్‌కు యువీ క్రియేష‌న్స్ విజ్ఞప్తి
x
Prabhas (File Photo)
Highlights

గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.

గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ప్రభాస్ కి ఇది 20వ సినిమా కావడం విశేషం.. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా వైర‌స్ ప్రభావంతో ఆగిపోయింది. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి 'రాధేశ్యామ్' లేదా 'ఓ డియర్' అనే పేర్లను పరిశీలిస్తున్నారు.

సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఒక అప్‌డేట్ కూడా లేక‌పోవ‌డంతో ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది కానుకగా టైటిల్ , ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్టు ఓ వార్తా బయటకు వచ్చింది. కానీ అది జరగలేదు. దీంతో అభిమానుల‌ను శాంతింప చేయ‌డానికి నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ట్విట్టర్ ద్వారా ప్రక‌ట‌న చేసింది. ప్రస్తుతం కరోనా వైర‌స్ ఫ్రభావంతో సినిమాకు సంబంధించిన యాక్టివిటీస్‌ను ఆపేశామ‌ని, షూటింగ్ మొదలయ్యాక సినిమా అప్డేట్స్ ను అందజేస్తామని వెల్లడించింది.

పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కాజల్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని సమాచారం.. సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

నాగ్ అశ్విన్ తో సినిమా:

ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది! సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories