బన్నీ ఐకాన్ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

బన్నీ ఐకాన్ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
x
Allu Arjun and Dil Raju (File Photo)
Highlights

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య, పరగు, దువ్వాడ జగన్నాధం అనే సినిమాలను చేసిన సంగతి తెలిసిందే..

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య, పరగు, దువ్వాడ జగన్నాధం అనే సినిమాలను చేసిన సంగతి తెలిసిందే.. ఈ మూడు మంచి విజయాలను సాధించాయి. వీరి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఐకాన్ అనే సినిమాని గత ఏడాది బన్ని పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఓ మై ఫ్రెండ్, ఎంసీఎ చిత్రాలకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు.

కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా లేకుండా పోయింది. ఈ సినిమాని పక్కన పెట్టి త్రివిక్రమ్, సుకుమార్ లతో సినిమాలను చేశాడు బన్నీ.. ఇక వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. అయితే ఇక ఐకాన్ సినిమా ఆగిపోయినట్టేనని అందరు అనుకున్నారు. కానీ నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్‌ టీమ్‌ తరఫున బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతేడాది ఏ పోస్టర్‌ను అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు.

దీనితో ఐకాన్ సినిమా ఆగిపోలేదనే ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్య, అర్య2, సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమే కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories