హీరోయిన్ మాధవీలత ఫేస్ బుక్ పోస్టు కలకలం.. త్వరలోనే చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ మాధవీలత ఫేస్ బుక్ పోస్టు కలకలం.. త్వరలోనే చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు
x
Highlights

టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. అయితే మాధవీలత పెట్టిన ఫేస్ బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. 'నచ్చావులే' సినిమాతో తన...

టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. అయితే మాధవీలత పెట్టిన ఫేస్ బుక్ పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. 'నచ్చావులే' సినిమాతో తన మార్క్ వేసుకున్న ఆమె తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు సంచలనం రేపుతోంది. తాను త్వరలోనే చనిపోతానేమో అంటూ పేర్కొనడంతో అభిమానులు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. చిన్న విషయాలకు కుంగిపోవద్దంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఆమె తనకు అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని త్వరలోనే నేను కూడా చచ్చిపోతానని రాసింది.

ఎదో ఒక రోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు తానుకూడా ఏ మందులు పనిచేయక ఒకరోజు చనిపోతానని తన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతూ ఉంటానని పేర్కొంది. ఆ సినిమాలో హీరోయిన్ వేసుకున్నట్లు తాను ప్రతీ దానికి నిత్యం ఏదో ఓక మెడిసన్స్ వేసుకుంటూ ఉంటానని తెలిపింది. ఏదో ఒక రోజు ఏ మందు పనిచేయక తాను కూడా చనిపోతానని తెలిపింది. తనకు మైగ్రేన్ తలనొప్పి,జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories