మరోసారి మానవత్వం చాటుకున్న ఎన్టీఆర్!

మరోసారి మానవత్వం చాటుకున్న ఎన్టీఆర్!
x
NTR(File photo)
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఉపాధి లేక చిన్నచిన్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఉపాధి లేక చిన్నచిన్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.అలాంటి వారిని ఆదుకోవడానికి సినీ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ.. తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దగ్గర పనిచేసే స్టాఫ్ కి అండగా నిలిచారని తెలుస్తోంది.. తన స్టాఫ్ తో పాటు వారి కుటుంబాలకు కూడా అండగా ఉంటానని ఎన్టీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది..

ఇప్పటికే వారికి అడ్వాన్స్ జీతాలు కూడా ఇచ్చారని ఫిలింనగర్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది..రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ అందరికీ నేనున్నా అనే భరోసా ఇస్తున్నారట ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఎన్టీఆర్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కరోనా వైరస్ పై పోరాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల కి భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.. అంతే కాకుండా సినీ కార్మికులు ఆదుకోవడానికి మెగాస్టార్ ఆధ్వర్యంలో ఏర్పడిన చారిటీకి సైతం ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఇస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories