శ్రీయా..ఏంటిది? జక్కన్న సీరియస్!

శ్రీయా..ఏంటిది? జక్కన్న సీరియస్!
x
Rajamouli, Sriya (File Photo)
Highlights

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం)..

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షన్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ RRRలో నటి శ్రీయ నటించబోతోందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో తనుకూడా భాగం కాబోతున్నట్టు స్వయంగా ప్రకటించింది శ్రీయ. తన పాత్రకు సంబంధించి వివరాలను తెలిపింది. RRR మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను కనిపించబోతున్నానని ప్రకటిస్తూ సీక్రెట్ రివీల్ చేసింది. గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి' చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీయ దాదాపు 15 సంవత్సరాల తరువాత మళ్ళి రాజమౌళితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అయితే మరోవైపు ఇప్పటిదాకా రాజమౌళి తన సినిమాలలో హీరోయిన్స్ పరంగా అనుష్క ను తప్ప వేరెవ్వరిని రిపీట్ చేయలేదు.. ఇప్పుడు రాజమౌళి తన సినిమాలో శ్రీయను రిపీట్ చేస్తుండటం విశేషం.

ఇప్పుడు రాజమౌళికి కోపం తెప్పించే పని చేసింది శ్రీయ. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరెకెక్కుతున్న RRR విషయంలో మొదటినుండి ప్రతీ విషయాన్నీ గోప్యంగా ఉంచుతూ.. మెల్లమెల్లగా సినిమాకి సంబంధించి అప్‌డేట్స్ ఇస్తున్న రాజమౌళికి శ్రీయ షాక్ ఇచ్చింది. ఇటీవలే RRRలో తాను నటిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ప్రతీ విషయాన్నీ సెక్రెట్జ్ గా ఉంచే రాజమౌళి శ్రీయ చేసిన పనికి షాకయ్యారట. తన పాత్రకు సంబంధించి వివరాలను లీక్ చేసిన శ్రీయ పై రాజమఔలి కాస్త సీరియస్ అయ్యారని సమాచారం. మరొక్క సరి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని జక్కన శ్రీయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories